తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్ని అసెంబ్లీ స్థానాలు.. ఓటర్లు ఎంతమంది? రౌండప్

బుధవారం, 11 అక్టోబరు 2023 (14:09 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబరు 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 13న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నవంబరు 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజున ఫలితాలను వెల్లడించారు. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,32,727 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,58,71,493 మంది పురుష ఓటర్లు కాగా, 1,58,43,339 మంది మహిలా ఓటర్లు ఉన్నారు. 2,557 మూడో కేటగిరీ ఓటర్లు (హిజ్రాలు) ఉన్నారు. వీరు కాకుండా సర్వీస్ ఓటర్లుగా మరో 15338 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో వందేళ్లు దాటిన ఓటర్లు 7689 మంది ఉండగా, 80 యేళ్లు దాటినవారు 4.44 లక్షల మంది, 18, 19 యేళ్ళు దాటిన వారు 8.11 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.06 లక్షల మంది ఉన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 మంది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 19 షెడ్యూల్ కులాలు, 12 షెడ్యూల్ తెగలకు కేటాయించగా (రిజర్వు), మిగిలిన 88 అసెంబ్లీ నియోజకవర్గాలను జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. 
 
ఈ పోలింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 897 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 14,458 పోలింగ్ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగుల కోసం 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేవలం మహిళలు మాత్రమే నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 597గాను, మోడల్ పోలింగ్ కేంద్రాలు 644 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు