చట్టం చేసిన రెండేళ్లలోపు దానికి ఎన్నిసార్లైనా సవరణ చేసే వీలుందని చేసిన ఏజీ వాదనతో ధర్మాసనం విభేదించింది. చట్టానికి ఒకసారి మాత్రమే సవరణ చేసే అవకాశముందని, అయినా ఏపీ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ఏజీకి కోర్టు మొట్టికాయ వేసింది. ఈసారైనా కోర్టుకు వచ్చేటప్పుడు విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకుని రావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆగ్రహంతో ఏజీ నోట మాట రాలేదట.