బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే.. వారికి అనుమతి లేదు

మంగళవారం, 15 మార్చి 2022 (15:35 IST)
స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డితో సస్పెన్షన్ కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.అంతకు ముందే అసెంబ్లీ సెక్రటరీతో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతివ ప తెలిసిందే.
 
హైకోర్టు తీర్పు కాపీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు అందించారు. అసెంబ్లీకి అనుమతిపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. 
 
అయితే ఈ విషయమై ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. ఎమ్మెల్యేలు కూడా  తమ వాదనను స్పీకర్ ముందుంచారు. అయితే తమ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు