కొత్తగూడెంలో విషాదం.. పురుగుల మందు తాగిన ప్రేమజంట

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:27 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట పురుగుల మందు సేవించింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో జరిగింది. 
 
మృతురాలి పేరు బోడ శ్వేత‌(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంక‌టేశ్ అనే యువ‌కుడిని ప్రేమిస్తోంద‌ని తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించగా, అందుకు పెద్దలు సమ్మతించలేదు. దీంతో వారిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ఈ దారుణానికిపాల్పడ్డారు 
 
కాగా, పురుగుల మందు తాగిన యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో స్థానిక ఆసుప‌త్రిలోని వైద్యులు చెప్ప‌డంతో అత‌డిని అక్క‌డికి మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఖ‌మ్మం ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు