రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు: టీఆర్ఎస్

శనివారం, 28 ఫిబ్రవరి 2015 (10:48 IST)
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన తాను బాధ్యత గల ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మరిచిపోయి, తమ పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. 
 
ఈ మేరకు వారు పెద్దపల్లి స్టేషనులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయనతో పాటు ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 
 
ఇకపోతే.. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలకు తాను మైక్ పట్టుకుంటే వణుకు అని కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి... నమస్తే తెలంగాణపై కూడా విరుచుకుపడ్డారు. కేసీఆర్ మానసపుత్రిక అయిన నమస్తే తెలంగాణ ఓ చెల్లని కాగితం అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

వెబ్దునియా పై చదవండి