హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేస్తే మరో ఉద్యమం తప్పదు: విజయశాంతి హెచ్చరిక

మంగళవారం, 23 జూన్ 2015 (16:57 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేసే విషయంపై ఆమె స్పందించారు. తెలంగాణలో సెక్షన్ 8 అమలు చేయడం అంటే ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే అవుతుందని అన్నారు. 
 
ఈ విషయంలో ఏ మాత్రం తేడాలు జరిగినా, సెక్షన్ ఎనిమి అమలు చేసినా మరో ఉద్యమం తప్పదని విజయశాంతి హెచ్చరించారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.

వెబ్దునియా పై చదవండి