ప్రతిపాదిత స్టేషన్లు, డిపోలు, ట్రాక్ పనుల పురోగతి తదితర అంశాలపై శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దిల్ఖుషా గెస్ట్హౌజ్లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), ఎల్అండ్టీ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు, మెట్రో ఉన్నతాధికారులతో కలిసి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈనెల 7న సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అధికారుల నుంచి ఆహ్వానం అందలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
పైగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించడమంటే ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చని బీజేపీ ముఖ్యనేతలు ఆరోపిస్తున్నారు.