రైతు బీమా పథకం యాడ్.. ఫోజిచ్చిన పాపానికి కుటుంబంలో చిచ్చు..

సోమవారం, 20 ఆగస్టు 2018 (18:14 IST)
రైతు బీమా పథకం కోసం ఫోటోకు ఫోజిచ్చిన పాపానికి ఓ మహిళ జీవితం నాశనమైంది. రైతుబీమా, కంటి వెలుగు పథకాలను తెలంగాణ సర్కారు చేపట్టిన సంగతి తెలిసిందే. లక్షలాది రైతులకు బాసటగా నిలిచిన ఈ పథకంలో ఓ రైతు కుటుంబం బొమ్మ ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ పథకాల కోసం ఉపయోగిస్తున్న ప్రింట్ యాడ్లు ఓ వివాహిత జీవితాన్ని చిందరవందర చేశాయి.
 
ఈ రైతు బీమా తెలుగు యాడ్‌లో భర్తతో మహిళ ఫోటో వుండగా, ఇంగ్లీష్ పేపర్లో మాత్రం వివాహిత భర్త స్థానంలో వేరొకరిని ప్రింట్ చేయడం ప్రస్తుతం సదరు మహిళకు ఇబ్బందులను కొనితెచ్చిపెట్టింది. ఆమె భర్త స్థానంలో మరొక వ్యక్తిని పెట్టడంపై కాపురంలో కుంపట్లను రాజేసినట్లైంది. తెలుగు వార్తా పత్రికల్లో వచ్చిన యాడ్లలో ఆమె పక్కన ఆమె భర్తే వున్నప్పటికీ.. ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన యాడ్లలో మాత్రం ఆమె భర్త స్థానంలో వేరొక వ్యక్తివున్నాడు. ఇది వారి కాపురంలో అశాంతికి కారణమైంది. 
 
ఇంకా భార్యాభర్తల మధ్య విబేధాలకు దారితీసింది. అంతేగాకుండా బంధువులు కూడా సదరు మహిళను సూటిపోటి మాటలతో హింసించసాగారు. ఈ వ్యవహారంపై సదరు మహిళ మండిపడింది. తన పక్కన వేరే వ్యక్తిగా భర్తగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రచార, సమాచార శాఖ రంగంలోకి దిగింది. ఇందుకు కారణమైన రెండు ఏజెన్సీలను వివరణ ఇవ్వాలంటూ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు