చెర్రీ - వెంకీలతో టార్చర్ పడుతున్న టాప్ డైరెక్టర్!
శుక్రవారం, 8 నవంబరు 2013 (09:51 IST)
FILE
రామ్ చరణ్, వెంకటేష్ల మల్టీస్టారర్ సినిమా ఈ నెలలో మొదలు కాబోతున్న కృష్ణవంశీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మొదలు కాకుండానే పడుతున్న కష్టాలను చూసి టాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ సినిమా మొదలవుతుందా అవదా అనే రకరకాల రూమర్లు నుండి చివరకు నిర్మాత బండ్ల గణేష్ చాకచక్యంతో వెంకటేష్ను అధికారకంగా ఒప్పించడంతో ఈ సినిమా ఈ నెలలో ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
అయితే సమస్య మళ్ళీ వేరే రూపంలో రామ్ చరణ్ ఇంటి వద్దకు చేరుకుందని అంటున్నారు. వెంకటేష్ను ఈ సినిమాలో ఓకే చేయించడానికి దర్శకుడు కృష్ణవంశీ చెర్రీకి చెప్పాకుండా చాల మార్పులు చేశాడట. అయితే ఫైనల్గా రెడీ అయిన కథలో చరణ్ పాత్ర తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రగా మారిపోవడంతో చరణ్ ప్రస్తుతం ఈ కథపై తీవ్ర అభ్యంతరాలు చేపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ఆఫ్ స్టోరీ మరీ వీక్గా కనబడడంతో మళ్ళీ ఈ కథలో మార్పులు చేయమని కృష్ణవంశీకి చెప్పాడని తెలుస్తోంది. ఒకప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు తీసిన కృష్ణవంశీ ప్రస్తుతం పరాజయాల బాటన ఉండటంతో అటు చరణ్ ఇటు వెంకటేష్లు రోజుకొక సలహాలు ఈ కధ విషయంలో ఇస్తూ ఉండటంతో షాక్కు గురైన కృష్ణవంశీ తాను సీనియర్ డైరెక్టర్నా లేక జూనియర్ డైరెక్టర్నా అని మదన పడిపోతూ ఈ సినిమా కథను తయరుచేస్తున్నాడని అంటున్నారు.