మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'శంకర్దాదా జిందాబాద్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెలాఖరులో ఉండవచ్చని రాజధాని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రంలో మిగిలిన రెండు పాటల చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుపుకుటోంది. ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రం ఆడియో పోస్టర్లు మెగా అభిమానులను ఎంతగానే ఆకర్షించాయి.
ఈ నేపథ్యంలో చిత్రం ఆడియో ఈనెల 22వ తేదీన ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తారని భావించినప్పటికీ.. తర్వాత అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో.. జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియోను ఈనెలాఖరులో విడుదల చేయాల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు అందించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.