తెలుగులో అగ్రహీరోల సరసన నటించనని ఆమధ్య స్టేట్మెంట్ ఇచ్చిన నటి నయనతార. ఆ తర్వాత హిందీ చిత్రం కహాని రీమేక్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే... మళ్ళీ మనసుమార్చుకున్నట్లు కన్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
బాలకృష్టతో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు చేశాక.. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తాజాగా ఇప్పుడు అటువంటి తరహా పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'రూలర్' అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఇంకా హీరోయిన్ను ఎంపికచేయలేదు. బహుశా తనను తీసుకుంటారేమోనని అలా వ్యాఖ్యానించి ఉంటుందని అనుకుంటున్నారు.