'మహా కుంభమేళా'లో మంచు లక్ష్మి... ఆ వారంరోజులు గుంజుకుంటుందట...!!

ఆదివారం, 10 ఫిబ్రవరి 2013 (18:06 IST)
FILE
మహా కుంభమేళాకు మంచు లక్ష్మీ వెళ్లినట్లు టాలీవుడ్ న్యూస్. అదలావుంచితే తాప్సీతో తను తీసిన గుండెల్లో గోదారి ఎన్నాళ్లగానో పెండింగ్ లో ఉంది. ఈలోపు మంచు లక్ష్మీప్రసన్న ఒంగోలు గిత్తలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇపుడికి గుండెల్లో గోదారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి మొదటివారంలో మిర్చి, అంతకుముందు ఒంగోలు గిత్త దూసుకురావడంతో విడుదలకు వీలుపడలేదు. కానీ ఫిబ్రవరి 3వ వారంలో టాలీవుడ్ నుంచి ఎవరి సినిమాలు విడుదల కావడం లేదని సమాచారం. దీంతో లక్ష్మీ మంచు ఈ వారంలో గుండెల్లో గోదారి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

పరీక్షలకు ముందే కనుక కలెక్షన్లకు పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కనుక ఆ వారం రోజులు గుండెల్లో గోదారికి వచ్చినవరికి గుంజుకోవడమేనని అంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత వెంటనే సునీల్ మిస్టర్ పెళ్లికొడుకు, సిద్ధార్థ్, సమంతల జబర్ దస్త్ సినిమాలు క్యూలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి