రాజమౌళి పెద్ద స్కీమ్ వేశాడు...'బాహుబలి' రెండు పార్టులుగా రిలీజ్!

బుధవారం, 9 అక్టోబరు 2013 (13:23 IST)
FILE
రాజమౌళి ఇప్పుడు కమలహాసన్‌ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల 'విశ్వరూపం' చిత్రాన్ని రూపొందించిన కమల్, త్వరలో దానికి 'పార్ట్ 2'ని కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే 'పార్ట్ 2' వుందన్నట్టుగానే 'పార్ట్ 1' కథను ముగించాడు. ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే స్కీమ్ అనుసరిస్తున్నాడట.

తను భారీగా తీస్తున్న 'బాహుబలి' చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ విస్తృతి, బడ్జెట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తొలి పార్ట్ విడుదల చేసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ పార్ట్ విడుదల చేస్తారట. అయితే, షూటింగు మొత్తం ఇప్పుడే కానిచ్చేస్తున్నారు.

అయితే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తే భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబటొచ్చని రాజమౌళి ప్లాన్. ఇదిలా ఉంచితే, ఇందులో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా ... రానాకు తనయుడిగా అడవి శేష్ నటిస్తున్నాడని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి