ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్స్టార్ రామ్చరణ్తేజ హీరోగా, బొమ్మరిల్లు కథానాయికగా జెనీలియా హీరోయిన్గా రూపొందించనున్న మెగా మూవీ ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.
కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ కె. నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించడం విశేషం. ప్రెస్టీజియస్ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది.
ఈ చిత్ర విశేషాలను నిర్మాత నాగేంద్రబాబు తెలియజేస్తూ.. అక్టోబర్ 21న పూజాకార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని, హైటెక్నికల్ వాల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని నాగేంద్రబాబు వెల్లడించారు.
ఈ చిత్రం కోసం కొంత పార్ట్ షూటింగ్ యుఎస్, ఆస్ట్రేలియాల్లో ప్లాన్ చేశామని, బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్ చిత్రాల తర్వాత భాస్కర్- రామ్చరణ్ తేజతో ఈ సినిమా చేస్తున్నారని నాగేంద్రబాబు అన్నారు. అందరి అంచనాలను మించే విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.