అక్కినేని నాగార్జున, కార్తీల మల్టీ స్టారర్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం చేసుకున్న నటి శ్రుతి హాసన్ చివరి నిమిషంలో తప్పుకున్నందుకు ఆమెపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తానని శృతిహాసన్ అంగీకరించింది. అనంతరం సినిమాలో నటించనని షూటింగ్కు ముందు రోజు శృతిహాసన్ మెయిల్ చేసింది. దీంతో బాధిత దర్శక నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో, శృతిహాసన్పై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.