కుల చిచ్చు రేపిన దాసరి: రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు ఎక్కడ..?

ఆదివారం, 1 మార్చి 2015 (17:35 IST)
ప్రముఖ సినీ దర్శకరత్న దాసరి నారాయణరావు కుల చిచ్చు చెలరేపారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని తెలిపారు. అయితే కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదాని ప్రశ్నించారు. 
 
తెలుగు సినీ చరిత్రను కొంతమంది కబ్జా చేశారంటూ ఆరోపించారు. సినిమా చరిత్రను మూసేయాలని వారు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చరిత్ర రాయడానికి మహా రచయితలు అవసరమని అన్నారు. అదేవిధంగా హీరోల మేనరిజంను బట్టి సినిమాలు తీయవద్దని దాసరి దర్శకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి