సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్ర పతాకంపై రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజ ఓ జంటగా, నాగశౌర్య, సనా మక్బుల్ మరో జంటగా నటించారు. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి పాటలు స్వరపరిచారు.
అచ్చ తెలుగు టైటిల్తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత తెలుగులో ఇంద్రజ నటించిన చిత్రం ఇది. తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్కి ఇది మంచి చిత్రం అవుతుందని ఇంద్రజ తెలిపారు. ఇక, అజయ్, నాగశౌర్య కూడా ఈ చిత్రవిజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.