'గోవిందుడు అందరివాడేలే' 15న ఆడియో - అక్టోబర్ 1 విడుదల

సోమవారం, 8 సెప్టెంబరు 2014 (16:55 IST)
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ప్రస్తుతం లండన్‌లోని పలు సుందరమైన ప్రదేశాలలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 15న చిత్రం ఆడియోను అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
 
శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎంఎస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాథ్, సమీర్, కారుమంచి రఘు, గిరిధర్, ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం. 
 
ఈ చిత్రానికి రచన; పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మన్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్

వెబ్దునియా పై చదవండి