వైభ‌వంగా జగ‌ప‌తిబాబు కుమార్తె వివాహం... ఎన్నారైతో....(ఫోటోలు)

బుధవారం, 11 మార్చి 2015 (17:50 IST)
టాలీవుడ్ ప్ర‌ముఖ నటుడు జ‌గ‌ప‌తి బాబు కుమార్తె మేఘ‌న వివాహం హైద‌రాబాద్‌లోని వెస్టిన్ హోట‌ల్‌లో వైభవంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. మంచి ముహ‌ర్తం కుద‌ర‌డంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండిపోయి చాలామందిని ఆహ్వానించ‌లేద‌ని, అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయానని అన్నారు.

 
దానితో తన కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్‌, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహాన్ని చేసినట్లు చెప్పారు. అందుకు ఎవ‌రూ ఏమీ అనుకోవ‌ద్దనీ,  తన బిడ్డ‌కు అందరి ఆశీస్సులు కావాలని  హీరో జ‌గ‌ప‌తిబాబు కోరారు. కాగా వరుడు ఎన్నారై.





 

వెబ్దునియా పై చదవండి