రభస ఆడియోను ఆగస్ట్ 1వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా విడుదల చేస్తున్నట్లు బెల్లంకొండ తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందన్నారు. తమన్ సారథ్యంలో రూపొందిన అన్ని పాటలూ చాలా ఎక్స్లెంట్గా వచ్చాయని, ఎన్టీఆర్, తమన్ కాంబినేషన్లో 'రభస' మరో మ్యూజికల్ హిట్ అవుతుందన్నారు.
ఎన్టీఆర్ కెరీర్లోనే కాకుండా, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడటం ఓ హైలెట్గా చెప్పొచ్చు. గతంలో జూనియర్....యమదొంగ, అదుర్స్, కంత్రీ చిత్రాల్లో గళం విప్పిన విషయం తెలిసిందే.