శ్వేతా బసు పునరావాస కేంద్రంలో హ్యాపీగా ఉందా...? అవునా...?

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:58 IST)
'కొత్త బంగారు లోకం'తో తెలుగు సినిమా తెరపైకి దూసుకొచ్చిన శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన విషయం విదితమే. ఆదివారం పట్టుబడిన ఆమెను సోమవారం పోలీసులు ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించడంతో అక్కడికి తరలించారు. 
 
వర్థమాన హీరోయిన్లలో టాప్ హీరోయిన్ గా వెలిగిన శ్వేతా బసు ప్రసాద్ హఠాత్తుగా బ్రోకర్ల ఉచ్చులో పడి వ్యభిచారం కేసులో బుక్ అయిపోవడం ఆమె కెరీర్ కు పెద్ద మచ్చే. ఐతే ఆమె ముఖంలో మాత్రం దిగులు తాలూకు ఆనవాళ్లు లేవట. ఎంచక్కా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి ట్వీట్లు ఇస్తూ మామూలుగా ఉన్నదట. పక్కవారితో సంతోషంగా పలుకరిస్తూ వారి జీవిత చరిత్రలు తెలుసుకుంటున్నట్లు టాలీవుడ్ న్యూస్.

వెబ్దునియా పై చదవండి