మూవీ మొఘల్, ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడుకి ఓ ప్రేమ కథా చిత్రాన్ని అంకితమివ్వబోతున్నారు. కన్నడలో హిట్టు కొట్టిన చిత్రం 'చార్మినార్'. ఈ చిత్రాన్ని 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' పేరుతో తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకాబోతోంది.
నాయుడు గారంటే తనకెంతో గౌరవమని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరంటూ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 12న ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.