స్నేహగీతం, ఇట్స్ మై లవ్స్టోరి, బ్యాక్బెంచ్ స్టూడెంట్ వంటి వైవిధ్యమైర కథాంశాలతో యూత్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మధురశ్రీధర్ తన తదుపరి చిత్రంగా 'లేడీస్ & జెంటిల్మెన్'ను పి.బి. మంజునాథ్ దర్శకత్వంలో నిర్మించారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్భట్ ప్రత్యేకంగా హైదరాబాద్లో వీక్షించారు.
సైబర్ క్రైం నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు ఇంటర్నెట్, ఎఫ్.ఎమ్ రేడియోల్లో టాప్ టెన్లో నిలవడం విశేషం. చైతన్యకృష్ణ, కమలకామరాజు, మహత్ రాఘవేంద్ర, అడవి శేష్, నిఖితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ భాసిన్ నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం రఘుకుంచె.