శనివారం ఉదయం హైదరాబాదు, వెంకటగిరిలోని స్వగృహం నుంచి మొదలైన ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఎంఎస్ నారాయణ చితికి ఆయన కుమారుడు నిప్పు పెట్టారు.
అంతకుముందు నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ అంతిమయాత్ర హైదరాబాదులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో పలువురు సినీ నటులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక ఆయన చివరి చూపుకోసం సన్నిహితులు, ఇతరులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.