'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రం ఇదే కావడంతో దీనికి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో అభిమానులు సినిమాకు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు. దీంతో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంటున్నారు. ఇందులో వరుణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది.