''ముకుంద'' సెన్సార్ పూర్తి: U/A సర్టిఫికేట్.. క్రిస్మస్ కానుకగా..

శనివారం, 20 డిశెంబరు 2014 (11:29 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వరుణ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'ముకుంద' సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ లభించింది. దీంతో ముందు అనుకున్నట్టుగా ఈ చిత్రాన్ని ఈ నెల 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు.
 
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రం ఇదే కావడంతో దీనికి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో అభిమానులు సినిమాకు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు. దీంతో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంటున్నారు. ఇందులో వరుణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది.

వెబ్దునియా పై చదవండి