ఈ అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు, ఆయన భౌతికకాయానికి సంగీత దర్శకులు కోటి, రఘు కుంచె, కీరవాణి సోదరుడు కల్యాణ్ కోడూరి, గాయని స్మిత తదితరులు నివాళులర్పించారు.
కాగా గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులు, సంగీత దర్శకులు, నిర్మాతలు అకాల మరణం చెందుతుండటంతో తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమలో వ్యక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ దోష నివారణ కోసం సినీ పరిశ్రమలో వారు మాహా మృత్యుంజయ హోమం కూడా చేశారు. అయినప్పటికీ సినీ ప్రముఖుల మృతి ఆగడంలేదు.