టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ను హర్ట్ చేశారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం టాలీవుడ్ నిర్వహించే మేము సైతం కార్యక్రమానికి ఈ ఇద్దరు దూరంగా ఉంటారని తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందారు.
హుదూద్ బాధితుల కోసం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఈ నెల 30వ తేదీన క్రికెట్ మ్యాచ్, కామెడీ స్కిట్ షోలు, డ్యానులు, కబడ్డీ, టంబోలా వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పవన్ కల్యాణ్, మహేష్ బాబు మాత్రం ఈ కార్యక్రమంలోని కొన్ని ప్రోగ్రామ్లకు హాజరు కారని తెలుస్తోంది.