చెక్ బౌన్స్ కేసులో... రజినీకాంత్ వియ్యంకుడికి అరెస్టు వారెంట్..!

మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (13:14 IST)
బ్యాంకు చెక్ బౌన్స్ అయిన కేసులో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వియ్యంకుడి అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఈ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో వియ్యంకుడిని అరెస్టు చేసి హాజరుపరచాలంటూ చెన్నై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు రజినీ వియ్యంకుడు ఎవరో తెలుసా.. తమిళ యువ హీరో ధనుష్ తండ్రి. ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా. 
 
చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్‌ చంద్‌ బోద్రా వద్ద దర్శకుడు కస్తూరిరాజా 2012లో రూ.65 లక్షల రుణం తీసుకున్నారు. అందుకుగాను కస్తూరిరాజా రెండు చెక్కుల్ని ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాద్రా, చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సోమవారం జరుగగా, కస్తూరిరాజా తరపున చివరు న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి కస్తూరిరాజాపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి