రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'బెంగాల్ టైగర్' చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్గా నటించనుంది. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా రామ్ సరసన కూడా నటించే ఛాన్స్ను పొందింది. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించే 'శివం' సినిమాలో రాశి ఓ హీరోయిన్గా నటిస్తుంది. అదేవిధంగా ఇంకొన్ని ఆఫర్లు కూడా చర్చల దశలో ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం. 2015 సంవత్సరం ఈ అమ్మడుకి లక్కీగా ఉన్నట్టుంది.