'శివం'లో రామ్ సరసన రాశిఖన్నా... కెమిస్ట్రీ కుదిరేనా..!

శుక్రవారం, 23 జనవరి 2015 (17:06 IST)
తెలుగు చిత్రసీమలో వరుస ఆఫర్లతో బిజీబీజీగా ఉన్న బ్యూటీ రాశిఖన్నా. ఇటీవల ఈ అమ్మడు నటించిన 'ఊహలు గుసగుస లాడే' చిత్రం హిట్టు కొట్టడంతో ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ ఆఫర్లు ఆవహించాయి. ఇప్పటికే గోపీచంద్ సరసన 'జిల్' సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ మరో వైపు  రవితేజతో కూడా నటిచేందుకు సిద్ధమైంది.
 
రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'బెంగాల్ టైగర్' చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా రామ్ సరసన కూడా నటించే ఛాన్స్‌ను పొందింది. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించే 'శివం' సినిమాలో రాశి ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. అదేవిధంగా ఇంకొన్ని ఆఫర్లు కూడా చర్చల దశలో ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం. 2015 సంవత్సరం ఈ అమ్మడుకి లక్కీగా ఉన్నట్టుంది.
 

వెబ్దునియా పై చదవండి