ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ కేసు సోమవారం విచారణకు రాగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదుల తుది వాదనలు ముగిసాయి. దీంతో ఈ కేసులో తుది తీర్పును మే నెల ఆరో తేది ప్రకటిస్తామని న్యాయమూర్తి డి.డబ్ల్యూ దేశ్ పాండే వెల్లడించారు. కాగా ఈ కేసులో సల్మాన్ దోషిగా తేలితే దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.