తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్గా, గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా పేరుపొందిన సునీత నటన వైపు కూడా తన చూపును మళ్లించింది. హీరో మహేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 'బ్రహ్మోత్సవం'లో సునీత పాత్ర ఏంటన్నది టాలీవుడ్లో చర్చనీయాంసంగా మారింది. అయితే ఇందులో సునీత, మహేష్ బాబుకు వదినగా నటిస్తున్నట్టు తాజా సమాచారం. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమై ఉంటుంది అంటున్నారు.
ఇక తను కొన్ని ఛానెల్స్లో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తుంది. ఆమె సుమారు 750 సినిమాలకు పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. పెద్ద టాప్ హీరోయిన్స్కి కూడా సునీత డబ్బింగ్ చెప్పింది. ఇదివరకు పలు మార్లు, వివిధ దర్శకుల చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చినా, సునీత సున్నితంగా తిరస్కరించింది.