ప్రముఖ నటి శ్రుతి హాసన్ స్థానంలోకి తమన్నా రానుంది. పీవీపీ సంస్థ నిర్మాణంలో నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రంలో కథానాయికగా శ్రుతిని ఎంచుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆమె అందులో నుంచి తప్పుకోవడం, ఈ వ్యవహారం కోర్టుకి వెళ్లడం మనకు తెలిసిందే.