ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం (22.12.14) నుంచి షూట్ చేస్తారని తెలిసింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, బాహుబలి ఫస్ట్ పార్ట్ను 2015 ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ చేసేందుకు రాజమౌళి ముహూర్తం ఖరారు చేసారు.