బుల్లెట్‌ లాంటి చూపుతో చంపేస్తానంటున్న టబు!

బుధవారం, 18 జులై 2012 (13:06 IST)
ఒకప్పుడు వెండితెరపై తెలుగులోనూ, బాలీవుడ్‌లోనూ యువతను వేడెక్కించిన నటి టబు. నాగార్జునతో చాలా చిత్రాల్లో నటించిన ఈమె కొంతకాలం గ్యాప్‌ తీసుకుంది. మలయాళ చిత్రం 'ఉరిమి'లో తనకున్న అందాల్ని మరోసారి చూపించే ప్రయత్నం చేసింది. అది పెద్దగా ఆడలేకపోయింది.

తాజాగా ఆమెతో కొత్త ప్రయోగాన్ని చేయడానికి బాలీవుడ్‌ దర్శకుడు సాయికబీర్‌ ప్రయత్నం చేయబోతున్నాడు. 'బుల్లెట్‌ రాణి'గా టైటిల్‌ రిజిష్టర్‌ చేశాడు. స్క్రీన్‌ప్లే రైటర్‌గా పేరుపొందిన సాయికబీర్‌ ఈ చిత్రంలో టబులోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తానంటున్నాడు.

ధూలియా నిర్మించనున్న ఈ చిత్ర కథ మధ్యప్రదేశ్‌లోని మారుమూల పాత్రం నేపథ్యంగా నడుస్తుంది. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రకథను తుదిమెరుగులు దిద్దుతున్నారు. తమిళ నటుడు విజయ్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కూడా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత చెప్పారు‌.

వెబ్దునియా పై చదవండి