ఆ హీరోయిన్‌పై కన్నేసిన దిల్‌రాజు.. మలయాళ కుట్టి చేతికి చిక్కేనా?

మంగళవారం, 28 జూన్ 2016 (16:03 IST)
సక్సెస్‌ ఎక్కడుంటే అక్కడికి ఈగల్లాగా నిర్మాతలు వచ్చేస్తుంటారు. ముఖ్యంగా దిల్‌రాజు. కొత్త హీరోయిన్లను అందులోనూ సెంటిమెంట్‌పరంగా లక్కీ అనుకున్నవారికే ఆఫర్లు ఇస్తుంటారు. కొత్తవారైనా.. వారిని చూసి ఫేస్‌రీడింగ్‌ కూడా చెప్పేగలడని సన్నిహితులు అంటుంటారు. అయితే తాజాగా.. ఆయన ఓ హీరోయిన్‌పై కన్నేశాడు. నితిన్‌తో 'అ..ఆ..' అంటూ జోడి కట్టిన అనుపమ పరమేశ్వరన్‌.
 
ఆ సినిమా సక్సెస్‌గా నిలవడడం.. హీరోయిన్‌కు పేరుకూడా రావడంతో.. ఆమెను తన తదుపరి చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆమెతో ఫొటో షూట్‌ కూడా చేయించాడు. ఇప్పటికే మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్న దిల్‌రాజు.. ఈమెతో తీయబోయే సినిమా ఈ ఏడాది ఆఖరులోనే వుంటుందట. 
 
శర్వానంద్‌ హీరోగా.. సతీష్‌ దర్శకత్వంలో రూపొందున్న చిత్రం కోసం ఆమెను ఎంపికచేసినట్లు తెలిసింది. మలయాళంలో 'ప్రేమమ్‌'లో ఆమె నటించింది. సెంటిమెంట్‌పరంగా అది కూడా ఆమెకు వర్కవుట్‌ అయింది. కాగా, బెల్లంకొండ సురేష్‌ తన కొడుకుతో బోయపాటి శ్రీనుతో తీయబోయే సినిమాకు అనుపమను అనుకున్నారు. కానీ ఎందుకనో వర్కవుట్‌ కాలేదని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి