బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శివాయ్'. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగణ్ తన సొంత బ్యానర్ అజయ్ దేవగణ్ ఎఫ్ఫిల్మ్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం వహించారు.
ఇదిలావుంటే... అజయ్ దేవగణ్ కుమార్తె నైసా దేవగణ్ తన తండ్రితో సంవత్సరంపాటు మాట్లాడలేదట. ఈ విషయాన్ని అజయ్ "శివాయ్'' సినిమా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ''శివాయ్'' షూటింగ్ నిమిత్తం బిజీగా ఉండటంతో నా కుమార్తె కోసం సరిగ్గా సమయం కేటాయించలేకపోయేవాడ్ని. దాంతో తనకి కోపం వచ్చి దాదాపు ఏడాదిన్నర పాటు నాతో మాట్లాడలేదు. కానీ తను సినిమా ట్రైలర్, పాటలు చూశాక.. ''ఇప్పుడు నాకు తెలిసింది మీరెందుకు అంత బిజీగా ఉన్నారో, మీరు నా తండ్రి కావడం గర్వంగా ఉంది'' అని కితాబిచ్చింది.