కానీ ఈమధ్య నిత్యానంద బెంగళూరులో ఆధ్యాత్మిక ప్రసంగం ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిందట మాళవిక. అంతే... నిత్యానంద తన దండంతో అలా నిమిరగానే పడిపోయిందట. అప్పటి నుంచి నిత్యానంద ఎక్కడ సందేశాలిస్తుంటే అక్కడికి వెళుతోందట. పైగా నిత్యానంద ప్రియ శిష్యురాలు రంజితతో పాటు కూర్చుని ఆమె మాదిరిగా కూర్చుని కిందికి పైకి ఎగురుతుందట. తెలుసు కదా... నిత్యానంద భజనలో భక్తులకు పూనకం వస్తే అదో రకంగా నేల మీద కిందికీ పైకి ఎగురుతూ ఉంటారు.