విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

ఐవీఆర్

శుక్రవారం, 27 జూన్ 2025 (23:30 IST)
అధ్యాపక అభివృద్ధి, విద్యార్థుల చైతన్యం, సాంకేతికత ఆధారిత పరిపాలనలో సంభావ్య భాగస్వామ్యాలను అన్వేషించడానికి శాన్ డియాగో విశ్వవిద్యాలయం (యుఎస్డి) నుండి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టిజిసిహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌తో సమావేశమైంది. తెలంగాణ- ప్రపంచ సంస్థల మధ్య విద్యా భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.
 
ఎంఎస్ అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎస్ అప్లైడ్ డేటా సైంటిస్ట్, ఎంఎస్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, ఎంఎస్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-లీడర్‌షిప్ వంటి మాస్టర్స్ ప్రోగ్రామ్‌లలో అధ్యాపకుల నైపుణ్యాన్ని పెంచడం, అధ్యాపక శిక్షణ, విద్యా నాయకత్వ అభివృద్ధి కోసం యుఎస్ ప్రతినిధి బృందం దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రతిపాదించింది. తెలంగాణ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలలోకి ప్రవేశించడానికి నిర్మాణాత్మక అవకాశాలను సృష్టించడంపై కూడా ఈ సమావేశం దృష్టి సారించింది. 
 
సమావేశం గురించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టిజిసిహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ, అర్థవంతమైన ప్రపంచ విద్యా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “ఒక రాష్ట్రంగా, ప్రపంచ విద్యా ప్రమాణాలను సాధించడానికి తెలంగాణ కట్టుబడి ఉంది. ఆ మార్గంలో కొనసాగడానికి శాన్ డియాగో విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయటానికి మేము సంతోషంగా ఉన్నాము..”అని అన్నారు. 
 
శాన్ డియాగో విశ్వవిద్యాలయంలోని షిలే-మార్కోస్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ చెల్ రాబర్ట్స్ మాట్లాడుతూ, “విద్య ద్వారా ప్రపంచ బంధాలను సృష్టించడం మేము విశ్వసిస్తుంటాము. ప్రభుత్వ విద్య, సామర్థ్య నిర్మాణంలో ఆవిష్కరణల పట్ల తెలంగాణ నిబద్ధత సమ్మిళిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న అభ్యాసం అనే మా లక్ష్యంకు అనుగుణంగా ఉంది. అధ్యాపకులు, విద్యార్థులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన కార్యక్రమాలను కలిసి అభివృద్ధి చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు