రాజమౌళి సినిమాలో రాశిఖన్నాకు ఛాన్స్.. చెర్రీతో రొమాన్స్..

మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (15:13 IST)
టాలీవుడ్ కథానాయిక రాశిఖన్నాకు దశ తిరగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే..? ఆమెకు బాహుబలి మేకర్, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చెర్రీ, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలో అవకాశం లభించింది. ఈ చిత్రంలో రాశిఖన్నా చెర్రీకి జోడీగా నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
 
జై లవకుశ, తొలిప్రేమ వంటి సినిమాలతో యూత్ మధ్య మంచి క్రేజ్ సంపాదించుకున్న రాశిఖన్నా.. రాజమౌళి చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ''రంగస్థలం'' సినిమాలో చరణ్ సరసన ముందుగా రాశి ఖన్నానే అనుకున్నారు. 
 
కానీ చివరికి ఆ అవకాశం సమంత కైవసం చేసుకుంది. అప్పట్లో రాశీఖన్నాకు దూరమైన ఆ ఛాన్స్.. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం ద్వారా చెర్రీతో నటించే ఆఫర్‌ను కొట్టేసిందని సినీ పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు