కమెడియన్ స్థాయి నుంచి హీరోగా మారిన కథానాయకుడు సునీల్ నటించిన తాజా చిత్రం ''జక్కన్న''. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించారు. ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా నటిస్తోంది. ప్రేమకథా చిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. ఫ్యామిలీ ఎండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే రిలీజైన టీజర్కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ''కృష్ణాష్టమి'' పరాజయం తర్వాత సునీల్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
''జక్కన్న'' ఆడియో వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈనెల 24న జరగనుంది. సునీల్ కోసం ''జక్కన్న'' పాటల వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతుండటం విశేషం. చిరంజీవితో పాటు 150వ చిత్రం దర్శకుడు వి.వి.వినాయక్ కూడా ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేస్తున్నారు. దీనికితోడు చిరు ఆడియో రిలీజ్ చేస్తున్నారు. చిరు 150 సినిమాలో నటించడానికి ఖాళీ లేదన్న నటుడి సినిమా వేడుకకు కూడా చిరంజీవి హాజరవుతుండటం ఇపుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.