డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి మూడ్ ఆఫ్! రాధేశ్యామ్ విడుద‌ల వాయిదా!!

బుధవారం, 5 జనవరి 2022 (11:49 IST)
టాలీవుడ్ బాహుబ‌లి... డార్లింగ్ ప్ర‌భాస్ మూవీ రాధేశ్యామ్ కోసం ఎంతో మంది రెబ‌ల్ స్టార్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తూన్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఇప్ప‌టికే ఇటు తెలుగు, అటు హిందీ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాల‌ను రేకెత్తించింది. తెలుగు క‌న్నా హిందీలోనే ప్ర‌భాస్ పాటలు భారీ హిట్ అయ్యాయి. రికార్డుల‌ను తిర‌గ‌రాశాయి. అలాంటి రాధేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ ఇపుడు సందిగ్ధంలో ప‌డింది. 
 
 
రాధేశ్యామ్‌ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా తీవ్రత దృష్ట్యా రాధేశ్యామ్‌ విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తాం’’ అని యూవీ క్రియేషన్స్‌ తెలిపింది. ఈనెల 14న రాధేశ్యామ్‌ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా ఈ సినిమాను దర్శకుడు రాధా కృష్ణకుమార్‌ తెరకెక్కించారు. కరోనా కారణంగా ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. క‌రోనా థ‌ర్డ్ వేవ్ దెబ్బ‌కి పెద్ద ప్రాజెక్ట్ ల‌న్నీ వెన‌క‌డుగు వేస్తున్నాయి. మ‌ధ్య‌లో లాక్ డౌన్ లు, క‌ర్ప్యూలు ఉంటాయ‌నే భ‌యంతో నిర్మాత‌లు వెన‌డుగువేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు