తమిళ హిట్ మూవీ 'వీరమ్' రీమేక్గా వస్తున్న ఈ సినిమా టీజర్, పోస్టర్స్... అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ అయితే యూట్యూబ్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో సినిమా ఓవర్సీస్ హక్కులను కొనేందుకు భారీగానే పోటీ ఏర్పడింది.
ఫలితంగా ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ముఖ్యంగా.. ఏకంగా ఈ ఓవర్సీస్ రైట్స్ రూ.11.5 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. పవన్, శ్రుతిహాసన్ కలయికలో గబ్బర్సింగ్ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.