నిర్మాతలు ఆర్టిస్టుగా తమ సినిమాల్లో కన్పించడం మామూలే. కానీ పేరు పొందిన నటుడు నిర్మాత కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ట్రెండ్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా 'ఓం' నే 3డి సినిమాను తీసి చేతులు కాల్చుకున్న తర్వాత కళ్యాణ్ రామ్ కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. తాజాగా 'పటాస్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. హీరోగా నటిస్తున్నాడు. అయితే... రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.