మెగాస్టార్ లూసీఫర్ స్ర్కిప్ట్ రెడీ, సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (19:49 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే... చిరంజీవి ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే బాబీతో ఓ సినిమా చేస్తాను. సాహో సుజిత్ ఓ సినిమా చేస్తానని ప్రకటించారు.
 
అయితే... సుజిత్‌తో లూసీఫర్ రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ.. సుజిత్ లూసీఫర్ రీమేక్‌లో చేసిన మార్పులు చేర్పులు నచ్చకపోవడంతో ఆ కథను తెరకెక్కించే బాధ్యత వినాయక్ అప్పగించారు.
 
 వినాయక్... లూసీఫర్ రీమేక్‌లో చేసిన మార్పులుచేర్పులు చిరంజీవికి నచ్చి ఓకే చెప్పారట. రీసెంట్ స్ర్కిప్ట్ ఫైనల్ నెరేషన్ పూర్తి అయ్యింది.
 
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తారు. బాబీతో సినిమా, మెహర్ రమేష్‌‌తో సినిమాలు ఉన్నప్పటికీ వీరద్దరి కంటే ముందుగా వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే... 2021 సమ్మర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు