చైతన్య సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందా..?

గురువారం, 20 ఆగస్టు 2020 (16:57 IST)
అక్కినేని నాగచైతన్య - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం లవ్ స్టోరీ. ఇందులో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ ఇంకా ఓ పాట, కొంత టాకీ షూట్ చేయాల్సివుంది. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్య చేయనున్న మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
 
ఈ వార్త అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుందని చెప్పచ్చు. ఇంతకీ.. ఆ న్యూస్ ఏంటంటే లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు.
 
 ఈ సినిమాకి బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నారు. థ్యాంక్యూ టైటిల్‌తో రూపొందే ఈ విభిన్న కథా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే… ఈ సినిమాలో చైతన్య మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారట.
 
ఈ మూడు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. మనం తరహాలో చాలా కొత్త కథ అని టాక్. ఫైనల్ నెరేషన్ విని చైతు ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే అఫిషియల్‌గా ఈ మూవీని ఎనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చైతన్య మూడు గెటప్పులో కనిపించడం అంటే కొత్తగానే ఉంటుంది. మరి... ఈ సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు