Nandamuri Mokshagna: ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ

సెల్వి

మంగళవారం, 24 ఫిబ్రవరి 2026 (19:15 IST)
ఆదిత్య 999 మ్యాక్స్ అనే భారీ ఫ్రాంచైజీలోకి మోక్షజ్ఞ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేపట్టబోతున్నట్లు సమాచారం. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రంతో బాలయ్యకు మైలురాయి లాంటి విజయాన్ని అందించిన క్రిష్, ఇప్పుడు మోక్షజ్ఞను ఎలా ప్రెజెంట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. 
 
సైన్స్ ఫిక్షన్ కథాంశానికి మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైనట్లు టాక్. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం. భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు