ఘాటుగా బూతులు తిట్టేవారు కావాలంటూ మహేశ్ కత్తి వ్యంగ్యంగా పోస్ట్!

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:15 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో చిక్కికొట్టుమిట్టాడుతున్న సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి ఇపుడు ఫేస్‌బుక్‌లో ఒక వ్యంగ్య పోస్ట్ చేశాడు. 'వెంటనే కావలెను' అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ఫోన్‌లో పచ్చి బూతులు తిట్టేవాళ్లు.. సరసమైన జీతానికి పని చెయ్యగలిగే వాళ్లు కావలెను. నాకు వచ్చే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని గౌరవంగా మాట్లాడే వారికి గౌరవంగా, చాలా వరకూ బూతులు మాట్లాడే వారు ఫోన్ చేస్తున్నారు కాబట్టి, వారిని ఘాటుగా బూతులు తిట్టే ఉద్యోగస్తులు కావలెను. 
 
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల అర్హత ఓపిక, పదునైన గొంతుతో పాటు తెలుగు భాషలో పచ్చి బూతులు మాట్లాడగలగడమే. ఆసక్తి గల అభ్యర్థులు నాకు దరఖాస్తు చేయండి’ అని మహేశ్ కత్తి వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా, పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలు గుప్పించిన అనంతరం, తనను దుర్భాషలాడుతూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ మీడియా వేదికగా మహేశ్ కత్తి వ్యాఖ్యానించడం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు