చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత నిజ జీవితంలో ఇష్టంలేని పనులు కూడా కిమ్మనకుండా చేయాల్సిందేనని అత్తారింటికి దారేది చిత్రంలో టాలీవుడ్ తెరకు పరిచయమే బాపు బొమ్మ ప్రణీత అంటోంది. ఈ ముద్దుగుమ్మ ఏం పిల్లో.. ఏం పిల్లడో చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పవన్తో జతకట్టి మంచి పేరు తెచ్చుకోగా, ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం రభసలో నటిస్తోంది.