నాకు నలుగురైదుగురితో అఫైర్ ఉంది.. రాయ్ లక్ష్మీ

గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:09 IST)
టాలీవుడ్ ఐటం బాంబా రాయ్ లక్ష్మి. బాలీవుడ్‌లో "జూలీ 2" చిత్రంలో తన అందాలను ఆరబోసింది. ఈ చిత్రం ప్రమోషన్‌లోభాగంగా ఆమెకు అనేక క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి ఆమె ఓపిగ్గానే సమాధానమిస్తోంది. కానీ, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో అఫైర్ సాగించింది. ఇదే అంశంపై ప్రశ్నించగా ఆమె అంతెత్తున ఒంటికాలిపై లేస్తోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను గతంలో మరో నలుగురైదుగురితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని, వారు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేనని తెలిపింది. వారందర్నీ వదిలేసి, కేవలం ధోనీ పేరే ఎందుకు ఇంకా ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించింది. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ మీడియా షాక్ తింది. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఇన్నేళ్లు ఉన్నప్పటికీ అఫైర్‌ల గురించి మాట్లాడని లక్ష్మీ రాయ్, బాలీవుడ్‌కి వెళ్లగానే అఫైర్‌ల గురించి మాట్లాడేస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌ను బాగా ఆకళింపు చేసుకుందని ఫిల్మ్ నగర్ టాక్.  

వెబ్దునియా పై చదవండి