కీలక సన్నివేశాల చిత్రీకరణలో రామ్ చరణ్ ధృవ

గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:10 IST)
రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్న ‘ధృవ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 
చరణ్.. రకుల్ .. అరవింద్ స్వామి తదితరులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్ ఇంటర్వెల్‌కి ముందు వస్తాయని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడనీ.. ఈ సీన్స్ ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో విడుదల కానుందనే వార్తలు వెలువడుతోన్న నేపథ్యంలో, ఆ సమయం కోసం చరణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి